“Hurry up
Chodavaram Bar Association Elections” Condregula David as President and Gorle.Krishnaveni as General Secretary #vizagwebnews
అనకాపల్లి జిల్లా:
చోడవరం:
“హోరాహోరీగా
చోడవరం బార్ అసోసియేషన్ ఎన్నికలు”
ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కాండ్రేగుల డేవిడ్, ప్రధాన కార్యదర్శి గా గొర్లె.కృష్ణవేణి ఎన్నికయ్యారు. 135 ఏళ్ల చరిత్ర గల చోడవరం కోర్టులో భారీ అసోసియేషన్ ఎన్నికలు ఇంత హడా వుడిగా ఎప్పుడూ జరగలేదు. రాజకీయ ఎన్నికలను తలపించే విధంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించి, 5 తర్వాత ఓట్లు లెక్కించారు. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా కాండ్రేగుల డేవిడ్, ప్రధాన కార్యదర్శి గొర్లే కృష్ణవేణి, ఉపాధ్యక్షులుగా సరిపల్లి నర్సింగరావు, కోశా ఆర్.ఎస్.పి నాయుడు ఎన్నికయ్యారు. పై 4 పదువు ధికారిగా లకు పోటీ జరగగా మిగిలిన పోస్టులకు గ్రంధాలయం కార్య దర్శిగా బర్ల శివప్రసాద్ (గణేష్), ఆటలు సాంస్కృతిక కార్య దర్శిగా బి.రాజు, మహిళ ప్రతినిధిగా కే నళిని ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఎన్నికల అధికారులుగా ద్వాదశి సాంబ, సరిపల్లి భవాని శంకర్ వ్యవహరించారు. నూతన అధ్యక్షులుగా కాండ్రేగుల డేవిడ్ సీనియర్ అడ్వకేట్ కాగా, గొర్లే కృష్ణవేణి గతంలో అడిషనల్ పీపిగాను, చోడవరం కోర్టుకు లేడీ రిప్రజెంటేటివ్ గా పని చేసారు.విశాఖ జిల్లా లోనే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా మహిళ ఎన్నికవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం….
నూతన కార్యవర్గంను పలువురు అభినందించారు…..